ATP: గుత్తి పట్టణంలోని ఏడీజే, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ అన్ని రకాల కేసులు కలిపి మొత్తం 530 కేసులను పరిష్కరించమని తెలిపారు.