ASR: కొయ్యూరు మండలానికి రెండు గర్భిణుల సంరక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని ట్రైబల్ వెల్ఫేర్ జేఈ శ్రీవిద్య తెలిపారు. యూ. చీడిపాలెం, కంఠారం పీహెచ్సీలకు రెండు గర్భిణుల సంరక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే యూ.చీడిపాలెం పీహెచ్సీలో భవన నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. సంరక్షణ కేంద్రాల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.