ASR: జీ.మాడుగుల మండలం గెమ్మెలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం 87 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కే.బాబ్జీ తెలిపారు. వారిలో ఆపరేషన్ కోసం వచ్చిన 83 మందికి విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు.