CTR: కుప్పంలో ఎన్జీవో హోమ్లో మంగళవారం జాతీయ పింఛనర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు పీజీ సెల్వం, ప్రధాన కార్యదర్శి గణేష్ పిళ్లై సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పింఛన్ దారులను సన్మానించనున్నట్లు తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి, పింఛన్ దారులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.