సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని బాబయ్య స్వామి దర్గా ఉరుసు సందర్భంగా పోలీస్ భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ వి.రత్న శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబయ్య స్వామిని ఎస్పీ దర్శించుకున్నారు. భక్తులుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ, సీఐ పాల్గొన్నారు.