చిత్తూరు: సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 19వ తేదీన కుప్పంలో పర్యటించనున్నారు. 19 నుంచి 4 రోజులపాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించనున్నారు.