ప్రకాశం: కత్తితో బెదిరించి దారి దోపిడీలు చేసే ముఠాను అరెస్టు చేసినట్లు ఉలవపాడు SI అంకమ్మ శుక్రవారం తెలిపారు. కందుకూరు CIతో కలిసి గురువారం నేషనల్ హైవేపై రాజుపాలెం జంక్షన్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడిందన్నారు. బైక్పై వెళ్తున్న రమేశ్, దివ్య తేజ అనే ఇద్దరి వద్ద కత్తి దొరకగా విచారణలో వారు దారి దోపిడీలు చేసే ముఠా అని తేలిందని అన్నారు.