బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాలో తాజా పరిస్థితులపై వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ప్రజలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ నాయకులకు స్పష్టం చేశామని వైట్హౌస్ ప్రతినిధి జాన్ కర్బీ తెలిపారు. పరిస్థితులు మెరుగుపరిచేందుకు తాత్కలిక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వెల్లడించారు. బంగ్లాలో పరిస్థితులను అధ్యక్షుడు జో బైడెన్ నిశితంగా పరిశీలిస్తున్నారని వైట్ హౌస్ పేర్కొంది.