BHNG: తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో మంచినీటి ప్లాంట్ను సర్పంచ్ పుట్ట సాయిలు ప్రారంభించారు. దాత గుర్రాల నాగేశ్వరరావు రెడ్డి ఆర్థిక సహకారంతో ఈ వాటర్ ఫిల్టర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామస్తుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన దాతను ఈ సందర్భంగా అభినందించారు.