MBNR: హన్వాడ మండలం ఎనిమిది తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పేదలకు భద్రమైన నివాసం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పథకం సొంతింటి కల నెరవేర్చుతూ సామాజిక సమానత్వానికి దారి తీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీమి బాయ్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.