ELR: జిలుగుమిల్లిలో ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి చిట్టి బొమ్మ కొండలరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలు అమలు చేయాలని కోరారు. సహజంగా చనిపోయిన కార్మికులకు రూ.60 వేలు ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు. ఈ ఆర్థిక సహాయం మరింత పెంచాలని కోరారు.