VZM: విజయనగరం మండలంలోని 22 గ్రామ పంచాయితీలకు చెందిన జనసైనికులు మంగళవారం రామనారాయణం సమీపంలోని తోటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా నెల్లిమర్ల శాసన సభ్యులు లోకం నాగమాధవి, జనసేన నాయకులు లోకం ప్రసాద్, అవనాపు విక్రమ్, భావన దంపతులు హాజరై దిశానిర్ధేశం చేశారు. ప్రతీ పల్లె, ప్రతీ గ్రామంలో జనసేన జెండా ఎగరాలన్నారు.