ASR: సూపర్ సిక్స్ను వెంటనే అమలు చేయాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6నెలలు అవుతుందన్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులకు రూ.20వేలు ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.