SRD: మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహరూపు రేఖలు మార్చడం సరికాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి పాల్గొన్నారు.