AP: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం వ్యాఖ్యలు మరోసారి ఏపీ ప్రజలను అవమానించనట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని చెప్పాడం సరికాదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ఏపీ ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకాని తనమని ధ్వజమెత్తారు. కడప ఉక్కు రాయలసీమ ప్రజల హక్కు.. విభజన చట్టంలోనే ఉందని స్పష్టం చేశారు. బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని ధ్వజమెత్తారు.