AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనాస్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. ‘ఈ ఘటనతో నిబంధనలను మరింత కఠినతరం చేస్తాం. ప్రతీ మూడు నెలలకోసారి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశిస్తాం. ఆర్డర్ టార్గెట్ రీచ్ కావాలని యాజమాన్యం నిబంధనలు పక్కన పెట్టింది. బాధిత కుటుంబాలను ఆదుకునే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’ అని పేర్కొన్నారు.