తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు ఉష్ణోగ్రతలలో భారీ పెరుగుదల కనిపిస్తుందని తెలిపింది. పగటి పూట ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని సూచించింది.