KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్యగిరింద్ర స్వామి ఆలయం వద్ద శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆలయ యాజమాన్యం, ఛైర్మన్ తమ కులవృత్తి హక్కులకు ఆటంకం కలిగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన హక్కులను పునరుద్ధరించే వరకు పోరాటం ఆపేది లేదని రజక సంఘం నాయకులు స్పష్టం చేశారు.