BHPL: మహదేవపూర్ మండలంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు CPM మండల నేతలు వినతి పత్రం అందజేశారు. మండల ఇంఛార్జ్ కుమ్మరి రాజు మాట్లాడుతూ.. పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.