NZB: జిల్లా మేరు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘టైలర్స్ డే’ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాదాసీదా వస్త్రానికి చక్కని ఆకారాన్ని ఇచ్చి, సమాజంలో మన అందాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే శిల్పులు టైలర్లు అని కొనియాడారు. వారి వృత్తి నైపుణ్యం అభినందనీయమన్నారు.