ADB: నార్నూర్ మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు శాస్త్రీయ ఆవిష్కరణలు, మోడల్స్, ప్రదర్శనలు ఏర్పాటు చేసి తమ ప్రతిభను చాటారు. శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, శాస్త్ర సాంకేతిక ప్రగతిపై ఉపాధ్యాయులు వివరించారు. ‘విజ్ఞానమే అభివృద్ధికి పునాది’ అని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.