MBNR: ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని హన్వాడ మండల ఎస్సై వెంకటేష్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్సై హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు మద్యం తాగి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు నడపకూడదన్నారు. పోలీసులకు సహకరించాలన్నారు.