JGL: పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం మోత్కరావుపేట గ్రామ శివారులోని చెరువు వద్ద పులి నీళ్లు తాగిన ఆనవాళ్లను గుర్తించిన అటవీ శాఖ అధికారులు, వారం రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో పులి మళ్లీ సంచరించడాన్ని ధృవీకరించారు. శనివారం తెల్లవారుజామున మోత్కరావుపేట సమీపంలో ఆవుల మందపై పెద్దపులి దాడికి తెగబడింది.ఈ ఘటనలో మూడు ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి.