SRPT: కోదాడ మండలం రెట్లకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై ఈరోజు పాఠశాలకు వెళుతున్న శ్రావణ్ కుమార్, రవిచంద్రలను ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్, రవిచంద్ర స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో సలీం షరీఫ్ వైద్యశాలకు వెళ్లి ఉపాధ్యాయులు పరామర్శించారు.