హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 పెరిగి రూ.1,51,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.3,00,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.