NGKL: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో వెలసిన 12వ శతాబ్దపు పురాతన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1171 నాటి చారిత్రక శాసనాలు, పురాతన బావి, మెట్లు, తేరు ఇప్పటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.