WG: గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా దెందుకూరి చిదంబర్ వెంకటరాజు అలియాస్ వంశీ, షేక్ అక్బర్లను ఆరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని బల్బు మేడ రోడ్డులో వీరిని అదుపులోకి తీసుకుని కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.