అన్నమయ్య: రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన “క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. డ్రైనేజీల శుభ్రపరిచే పనులను పరిశీలించిన ఆయన, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు.ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను నిర్లక్ష్యంగా వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.