SDPT: చేర్యాల పట్టణానికి చెందిన చుంచు వివేక్ అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, అతని పేదరికాన్ని గమనించి ‘చేర్యాల అంబేద్కర్ నగర్’ సభ్యులు అండగా నిలిచారు. దాతల నుంచి సేకరించిన రూ.24,000 నగదును శుక్రవారం వివేక్ కుటుంబానికి అందజేశారు. ఆపద కాలంలో స్పందించి ఆర్థికంగా సహకరించిన ప్రతి దాతకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.