NRPT: ధన్వాడ మండలంలోని మందిపల్లి స్టేజ్ వద్ద బస్సు షెల్టర్ను సర్పంచ్ సురేందర్ రెడ్డి సొంత నిధులు రూ.20 వేలతో మరమ్మతులు చేయించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోడలకు రంగులు వేయించి, కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించారు. షెల్టర్ ఇప్పుడు సరికొత్తగా మారింది. సర్పంచ్ చొరవపై గ్రామస్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.