AP: అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద 50 రోజుల అదనపు పనిదినాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ పేదల సంక్షేమం కోసం ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2025 ఖరీఫ్లో రాష్ట్రప్రభుత్వం ఈ జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది.