కోనసీమ: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటులు అన్నపూర్ణ, రజిత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. వారికి అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించిన వారు ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపారు. వీరి రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.