ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో గురువారం బసీనేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు నూర్ భాషాపై వైసీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో నూర్ భాషాకు గాయాలయ్యాయి. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.