KMR: లింగంపేట మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్ వెంకట రాములు పర్యవేక్షణలో వైద్యులు హరికిషన్ విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. దృష్టి లోపం ఉన్న వారికి త్వరలోనే కళ్లద్దాలు అందజేస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ క్రాంతి, నర్సింగ్ ఆఫీసర్ పాల్గొన్నారు.