HNK: కాజీపేట పట్టణ కేంద్రంలోని విష్ణుపురి కాలనీలో బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్క్రీమ్తో పాటు గడువు తీరిన 12 రకాల రూ. 60,400 విలువ గల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు.