E.G: పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి శనివారం కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్లో సమీక్షించారు. కొన్ని ఏజెన్సీలు, సరఫరాదారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన నిఘా ఉంచి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలన్నారు.