NDL: నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏబిఎం చర్చి దగ్గర ప్రమాదవశాత్తు బస్సు ఎక్కుతూ వెనక టైర్ కిందపడి సయ్యద్ యూసుఫ్ (63)మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు ఎస్సై మణికంఠ తెలిపడంతో.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.