అంతర్జాతీయంగా ఇంధన ధరల ఒడుదొడుకులు, పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2025-26 మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 12.5% తగ్గి రూ.16,791 కోట్లుగా నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ.3.03 లక్షల కోట్లకు చేరడం విశేషం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి(2025-26) లాభం 16% వృద్ధితో రూ.80,775 కోట్లుగా ఉంది. సంస్థ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది.