కర్నూలు: జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాపర్టీ కేసులలో పోలీసులు బాగా పని చేయాలని సూచించారు.