ASR: జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో జిల్లాలో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. అందుబాటులో ఉన్న వాటితో, పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నీతి అయోగ్ ప్రోగ్రాంలో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0 నిర్వహించారు.