E.G: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు చూస్తుందని నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు బద్రం దొర విమర్శించారు. బుధవారం నిడదవోలు మండలం కలవచర్లలో ఉపాధి హామీ కూలీలకు పథకం గురించి వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.