శ్రీకాకుళం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న డయేరియా ఘటన పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కుర్మారావును బుధవారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమయ్యారని ఈమేరకు చర్యలు తీసుకున్నారు.