TPT: ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ తల్లి తన కుమార్తెను హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆశాలత భర్తతో విడాకులు తీసుకుని భరణం కింద రూ.4 లక్షలు పొందింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా రెడ్డి కుమార్తో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తోంది. వారి పెళ్లికి కుమార్తె అడ్డుగా ఉందని భావించి ఆమెను హత్య చేసి పూడ్చి పెట్టినట్లు సమాచారం.