SRPT: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన కాలు రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన నరసయ్య వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులు మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.