AKP: రాంబిల్లి(మం) మూలజంప జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు విద్యార్థులను చదివిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు హెచ్ఎం బాల ప్రభావతి, హిందీ టీచర్ రమణారావు తెలిపారు. శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.