SRD: కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా మాణిక్యం మంగళవారం ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఐఐటీ వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతులకు పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.