KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ‘PGRS’ నిర్వహించనున్నట్లు పీడీ శివరాం ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. రాలేని వారు ఆన్లైన్లో విన్నవించుకోవచ్చన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.