KDP: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 62 కేంద్రాల్లో 15,159 మంది నమోదు కాగా, 14,777 మంది హాజరై 97 శాతం హాజరు నమోదైంది. మొత్తం 382 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,011 మందిలో 13,691 మంది హాజరై 320 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,148 మందిలో 1,086 మంది పరీక్షలు రాయగా 62 మంది హాజరుకాలేదు.