AP: గత పాలకులు ఆలయాలపై దాడులు జరిగిన పట్టించేకోలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో అందరూ బాధితులే. లడ్డూ కల్తీపై అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, మా ప్రభుత్వంలో నాలుగు అంశాలపై దృష్టి పెట్టాం. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకులు, వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం పనులు చేపట్టనున్నాం’ అని పేర్కొన్నారు. లడ్డూ కల్తీ ముమ్మాటికీ కుట్రే అని విమర్శించారు.