KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు సదాశివనగర్ TS మోడల్ స్కూల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అద్దాలు వాడాలని తెలిపారు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించాలని, విటమిన్లు ఉన్న పోషక పదార్థలను తీసుకోవాలన్నారు.